ప్రజల నుంచి పౌరులుగా – రాజ్యాంగం తెచ్చిన నిజమైన మార్పు
26 జనవరి ప్రత్యేక రచన | ప్రజలకు ఒక సందేశం
1947కి ముందు ఈ దేశ ప్రజలను “పౌరులు” అనలేదు.
మనమంతా Subject లం. అంటే— ఆదేశాలు పాటించాలి, ప్రశ్నించకూడదు, ఎదిరించకూడదు.
ఆ కాలంలో చట్టం ప్రజల కోసం కాదు, పాలకుల కోసం.
1947లో స్వాతంత్ర్యం వచ్చింది. కానీ 1947తో కథ ముగియలేదు.
స్వాతంత్ర్యం చెయ్యిలో జెండా ఇచ్చింది.
గణతంత్రం చెయ్యిలో శక్తి ఇచ్చింది.
1950 జనవరి 26న ఈ దేశం ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది.
ఇక ప్రజలు ఆదేశాలు పాటించే Subject లు కాదు.
ఇక ప్రజలే చట్టాన్ని తయారు చేసే పౌరులు.
పౌరుడి అర్థం ఏమిటి?
పౌరుడు అంటే భయపడని వ్యక్తి. ప్రశ్నించే వ్యక్తి. తన హక్కును తెలిసిన వ్యక్తి.
పౌరుడు అంటే అన్యాయం జరిగితే మౌనంగా ఉండని వ్యక్తి.
కానీ ఒక ప్రశ్న—
ఈ రోజు మనం నిజంగా పౌరులుగా నడుచుకుంటున్నామా? లేదా మళ్లీ Subject లుగా మారిపోతున్నామా?
అన్యాయం చూసి మౌనం పాటిస్తే మన పౌరత్వం నెమ్మదిగా మసకబారుతుంది.
హక్కులు మాత్రమే అడిగి, బాధ్యతలు మర్చిపోతే పౌరత్వం ఖాళీ పదంగా మారుతుంది.
గణతంత్రం అంటే రాజు లేకపోవడం కాదు, భయానికి చోటు లేకపోవడం.
— 26 January Special | Message to the Public
No comments:
Post a Comment